సైదాబాద్ : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి మనుమంతరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యాలను నిరసిస్తూ బుధవారం చంపాపేట అలీ కేఫ్ చౌరస్తాలో ఐఎస్ సదన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీరంగ ఆధ్వర్యంలో సంజయ్దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మన్నె శ్రీరంగ మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మైనంపల్లికి వస్తున్న ప్రజా ఆదరణను చూసీ ఓర్వలేని బీజేపీ నాయకులు అనుచిత గా ప్రర్తిస్తున్నారని అన్నారు.
మంచి నాయకుడిగా ప్రజలచేత గుర్తింపు పొందిన మైనంపల్లిపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తే సహించేదిలేదని, బండి సంజయ్ తన స్థాయి మరిచి మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడే వారికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తగిన విధంగా బుధ్ది చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నాయకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రజలనుంచి దూరం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందునాయక్, శ్రీనివాస్ వాల్మీకి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు రమేశ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవినాయక్, మధు, వెంకటేశ్, హోటల్ శ్రీను, సుగ్రీవ తదితరులు పాల్గొన్నారు..