గోపాల్పేట, జనవరి 20 : మండలంలోని బుద్ధారం పెద్ద చెరువుకు మహర్దశ పట్టనున్నది. ఈ చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి రూ. 44.71 కోట్లు కేటాయించింది. ఈ పనులు పూర్తయితే గోపాల్పేట, వనపర్తి, పెద్దమందడి మండలాల్లో సుమా రు 40 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతో ఆయా మండలాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పెద్ద సంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు చెరువు వద్దకు చేరుకొని కృతజ్ఞతగా.. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై నిరంజన్రెడ్డి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పాత్లావత్ హర్యానాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతియాదవ్, సింగిల్విండో వైస్ చైర్మన్ గు వ్వల రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సర్పంచులు బిల్లకంటి పద్మమ్మ, పొడుగు శ్రీనివాసులు, ఎంపీటీసీ అర్రు శ్రీదేవి, ఉప సర్పంచ్ నాగరాజు, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు కృష్ణారావు, మన్యం నాయక్, మాజీ జెడ్పీటీసీ చిట్యాల వెంకట్రావు, కోఆఫ్షన్ సభ్యు డు మతీన్, నాయకులు వెంకటయ్య, కోటీశ్వర్రెడ్డి, శ్రావణ్, విష్ణు, రాజాబాబురెడ్డి, శంకరయ్య, రాజు, రాజేశ్, కృష్ణయ్య, పూల్యానాయక్, రవి, శ్రీనివాస్రెడ్డి, రాంబాబురావు, మల్లయ్య, సిద్ధయ్య పాల్గొన్నారు.