శంషాబాద్ రూరల్ : గ్రామాలకు బొడ్రాయి విగ్రహాలు మూలస్థంభాలుగా పిలుస్తారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని కవ్వగూడ గ్రామంలో గతమూడు రోజుల నుంచి బొడ్రాయి విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలు స్థానిక సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
చివరి రోజు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్రాయి గ్రామాలకు మూలస్తంభాలు నిలుస్తాయని వివరించారు. ప్రతి గ్రామంలో బొడ్రాయి ఊరిమద్యలో ఉంటు గ్రామ ప్రజలకు కంటికిరెప్పల కాపాడుతుందన్నారు.
అలాంటి బొడ్రాయి గ్రామంలో తప్పనిసరిగా పూర్వకాలం నుంచి ఉంటుందన్నారు. కొన్ని గ్రామాలలో మనగడలో లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు కలిసి నూతనంగా ప్రతిష్టాపన చేస్తున్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, ఎంపీటీసీ సంగీత, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ మైసయ్యయాదవ్,గ్రామ యువకులు అనీల్గౌడ్, సురేష్ ముదిరాజ ప్రవీణ్యాదవ్, నీరటి దేవేందర్లతో పాటు పలువురు నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.