కందుకూరు : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న డ్రామాలను ఆపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదేవి శేఖర్రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు రాష్ట్ర నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని తెలిపారు.అభివృద్ధి విషయంలో వారికి అవగాహన లేదని చెప్పారు. ఇష్టం మొచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు.
బీజేపీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని. తీరు మార్చుకొకుంటే ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు ఉంటే వారికి మింగుడు పడడం లేదని పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరించకుండా విమర్శలు చేయడం తగదని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జమ్మత్రెడ్డి, మల్లేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.