వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ అనుపమనగర్కు చెందిన రామచంద్రరావు గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్యం నిమిత్తం నిమ్స్ దవాఖానకు వెళ్లాడు.
చికిత్సకు ఆర్థిక స్థోమత సరిపోకపోవడంతో ఎమ్మెల్యే సిఫారసుతో సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆయనకు రూ.4లక్షలకు ఎల్వోసీ మంజూరయ్యింది. ఆ చెక్కును సోమవారం ఎమ్మెల్యే బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధవహించాలన్నారు.
వ్యాయామం, యోగా వంటి సాధనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతుల రాజిరెడ్డి, శ్రీనివాస్నాయక్, శ్రీనివాస్ యాదవ్, నాగిరెడ్డి, రాఘవేంద్రరావు తదితరులు ఉన్నారు.