రాయపోల్, జనవరి 14 : మండలంలోని అనాజీపూర్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు బయ్యన్నగుండ్ల జాతర కొనసాగనున్నది. ప్రతి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గ్రామానికి చివరలో ఉన్న బయ్యన్నగుండ్లను రంగులతో అందంగా అలంకరించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు ఉంటాయని, సాయం త్రం బండ్ల ఊరేగింపు, జాతర, తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అనాజీపూర్తో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం గ్రామంలోని దుర్గ మ్మ ఆలయం వద్ద బండ్ల ఊరేగింపు, బోనాల శోభాయాత్ర తదితర కార్యక్రమాలు ఉంటాయి. గ్రామానికి బంధువులు పెద్దసం ఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది.