బండ్లగూడ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంఘర్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహరించాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ అమోయ్కుమార్ పేర్కొన్నారు.మంగళవారం ఆయన రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్,ఆర్డీవో చంద్రకళ,తహశీల్దార్లు చంద్రశేఖర్,జనార్ధన్లతో కలసి అన్నిమతాల పెద్దలతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారి అయిన ఎన్హెచ్ 44 ఆరు లేన్ల రహదారి నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మత పరమైన దేవాలయాలు,మసీద్లను జరుప వలసి వస్తే మత పెద్దలు సహరించాలన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మత పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా తిరిగి వచ్చే నెల మూడున సమావేశం కావాలని నిర్ణయించారు.