బేగంపేట్ : బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గురువారం విద్యార్ధులకు బాధ్యతలను అప్పగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా సంతోష్రావు హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్, మధ్య ప్రైమరీ స్కూల్కు చెందిన విద్యార్ధులకు నాయకత్వ బాధ్యతలను అప్పగించి వారిని సత్కరించారు.
హెడ్ బాయ్గా శివ బ్రహ్మవిద్ చెల్లూరి, హెడ్గర్ల్ గా ఇహిత వరదలను నియమించారు. ఈ సంధర్భంగా పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. విద్యార్ధులు జీవితంలో సరైన నిర్ణయం తీసుకోని ముందుకు సాగాలన్నారు. భావితరాలు అశించిన విధంగా ఆదర్శవంతంగా, సమాజం మెచ్చుకునే పౌరులుగా రాణించాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో బెల్, బిల్వా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్కందబాలి, బోర్డ్ఆఫ్ గవర్నర్ చైర్మన్ గుస్తీ నోరియా, ఫయాజ్ఖాన్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.