ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిసెంబర్ 9వ తేది చారిత్రకమైనదని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ అయిన బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగం నేతగా తనతో పాటు వేలాది మంది విద్యార్థులు కదం తొక్కిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు.
నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో దిగి వచ్చిన కేంద్ర సర్కారు డిసెంబర్ 9వ తేదీన ప్రకటన చేసిందన్నారు. అనంతరం ఆయన బోరబండ నుంచి బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్తో కలిసి అమర వీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ కటౌట్కు, అమర వీరుల స్థూపానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో శాట్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్వీ నేతలు వినీత్కుమార్, మేకల రవి, శ్రీకాంత్, అనిల్, ప్రణీత్, కృష్ణ, నవీన్, ఇలియాస్, జహీర్, పాండు, పలువురు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.