కందుకూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు సీఎం కేసీ ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాక్ ఖాతాల్లో జమచేయడంతో కందు కూరు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదు, శ్రీశైలం రహదారిపై ఆయన చిత్రపటానికి పాలాబిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,8వ విడతల్లో కలిసి 50వేల కోట్ల రూపాయల జమచేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతు బంధు నిధులతో రైతులను ఆదుకున్న రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.రైతులు దేశానికి వెన్నుముకని పేర్కొన్నారు.
రైతుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వివరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి వివిధ గ్రామాల పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.