మారేడ్పల్లి : రన్నింగ్ ట్రైన్లోంచి దిగబోతూ..ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో ఓ వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న రైలు 10వ నెంబర్ ప్లాట్ ఫారంకు వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వృద్దుడు రన్నింగ్ రైలు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందడడంతో ఎడమ చేతి, తలకు గాయం కావడంతో..వెంటనే రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పోందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతుని వయసు సూమారు 55-60 సంవత్సరాలు ఉంటాయని వెల్లడించారు.