కాచిగూడ : మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లా జోహనపురం ప్రాంతానికి చెందిన సలీంబాషా (45) కు గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగ్గాలేదు.
ఈ క్రమంలో గురువారం ఫలక్నుమా రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని స్వాధీనపర్చుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పండరి తెలిపారు.