మియాపూర్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని గెలుపోటములు పక్కకు పెట్టి క్రీడల్లో తప్పకుండా భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన కుంగ్పూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన విద్యార్థులు కర్మన్ ఘాట్లో జరిగిన కరాటే కుంగ్పూ జాతీయ స్థాయి పోటీలో బంగారు వెండి పతకాలు సాధించిన నేపథ్యంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి నేతృత్వంలో విప్ గాంధీని ఆదివారం ఆయన నివాసంలో కలిసారు.
ఈ సందర్భంగా విజేతలను విప్ గాంధీ అభినందించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. నేటి పరిస్థితుల్లో స్వీయ ,ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటివి అభ్యసించాలని విప్ గాంధీ సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు పార్టీ నేతలు సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, భాస్కర్రావు,నాగేశ్వర్రావు, అష్రఫ్, అబుల్ పాల్గొన్నారు.