వనస్థలిపురం : కోట్లాది కుటుంబాలకు ఆసరాగా ఉండే జీవితబీమా సంస్థకు ఏజేంటు ఆత్మలాంటివారని త్రిదండి రామా నుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. ఎల్ఎఐసీ ఏజెంట్స్ ఫెడరేషన్ (లియాఫీ) హైదరాబాద్ డివిజన్ 18వ సర్వసభ్య సమావేశం సాగర్రింగ్రోడ్లోని కేకే గార్డెన్లో జరిగింది. కార్యక్రమానికి స్వామిజీ ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చారు.
ప్రజలకు సంస్థకు అనుసంధాన కర్తలుగా దేశవ్యాప్తంగా ఏజెంట్లు చేస్తున్న సేవలు హర్షణీయమన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి కుటుంబం బీమా కోసం కొంత ధనాన్ని కేటాయించుకోవాలని సూచించారు.
ఏజెంట్లు పాలసీలను ప్రజలకు వివరించి వారికి మేలు చేయడంతోపాటు, ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. రామా నుజాచార్యుల విగ్రహావిష్కరణ ఉత్సవాలు ఫిబ్రవరి 2నుంచి 12వరకు శంషాబాద్ మండలం ముచ్చింతలలో నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. వెయ్యేళ్ల క్రితమే అంటరానితనం నిర్మూలన కోసం రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారన్నారు.
ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో లియాఫీ జాతీయ అధ్యక్షుడు సింగారపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్వి శ్యామల్ చక్రవర్తి, ఎస్బి శ్రీనివాస్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడు సీతయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, సుదర్శన్, కటకం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.