నిర్మల్ టౌన్/ఎదులాపురం, ఏప్రిల్ 28 : వచ్చే నెలలో జరగనున్న పది, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయ క్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, కుర్చీలు, తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సుదూర ప్రాంత విద్యార్థులు, హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సమయానికి బస్సు లు నడిచేలా చూడాలని సూచించారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించా లన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే 1800-599-9333 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదిం చాలని విద్యార్థులు సూచించారు. మాస్కా పీయింగ్ జరుగకుండా తనిఖీ బృందాలను ఏర్పా టు చేసుకోవాలన్నారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలు 64, ఇంటర్ పరీక్షా కేంద్రాలు 33 ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పా టుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా చోట్ల నిర్మల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు రాంబాబు, ఎన్ నటరాజ్, డీఈవోలు రవీందర్ రెడ్డి, డీఈవో ప్రణీత, ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు పరశురాంనాయక్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, రవీందర్, ఆర్డీవో రాజేశ్వ ర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.