అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని, దళితులు సర్కారు ఇచ్చే యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యశ్వంత్గూడ పంచాయతీ పరిధిలో గల కొత్తగూడెంలో ఆదివారం 15 మంది లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్, బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఆదిలాబాద్ టౌన్, మే15: అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని, దళితులు సర్కారు ఇచ్చే యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యశ్వంత్గూడ పంచాయతీ పరిధి కొత్త్తగూడెంలో 15 మందికి దళితబంధు యూని ట్ల మంజూరు పత్రాలను ఆదివారం పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్, బుద్ద భగవాన్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. లబ్ధ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అంతకుముందు యాపల్గూడలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాములగూడ, కొత్తగూడెంలలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టేలా పథకాలు మంజూరు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆరేనని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మహానీయులు సరసన చేరారన్నారు.
బీజేపీ,కాంగ్రెస్ నాయకులు తోడు దొంగలని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి-జగదీశ్, ,వైస్ ఎంపీపీ గండ్రత రమేశ్, డీఈవో ప్రణీత, ఎంఈవో జయశీల ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ప్రత్యేకాధికారి పద్మభూషణ్ రాజు, పీఆర్ ఏఈ సంతోష్గౌడ్ ,సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మే 15: ప్రతి ఒక్కరూ చదువుకున్నపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అజయ్, బండారు సతీశ్, శ్రీనివాస్, డీఈవో టామ్నె ప్రణీత, ఎంఈవో జయశీల పాల్గొన్నారు.