బేల, మే 14 : గత ప్రభుత్వాలు విద్య, మౌలిక వసతులను గాలికొదిలేశాయని, విద్యావిధానంలో మార్పు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. మండలంలోని జూనోని, గూడ గ్రామాల్లో మొదటి విడుతలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి దేవాలయంలా చూసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యా విధానానికి ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్కు మరింత తోడ్పాటు కానున్నదని తెలిపారు.
ప్రపంచ దేశాల్లో సైతం మొదటి ప్రాధాన్యం చదువుకే ఉందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై పట్టు సాధించినప్పుడే ఉ న్నత స్థానంలో గౌరవించబడతారని పేర్కొన్నా రు. ‘మన ఊరు- మన బడి’తో విద్యావిధానం లో కీలక మలుపు కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు విద్యను పట్టించుకోకపోవడంతో కుంటుపడిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి స్కూల్లో గదుల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, కరెంట్, మరుగుదొడ్ల సౌకర్యం కోసం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
ఊరిలో ఉన్న పాఠశాలలో ప్రతి పేద వారి పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుతారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జూనోని గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అత్యంత నిరుపేద కుటుంబాలకు 50 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని తెలిపారు. గ్రామంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, రెండు అదనపు తరగతి గదుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావు త్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, జక్కుల మధుకర్, మంగేశ్ ఠాక్రె, వట్టిపెళ్లి ఇంద్ర శేఖర్, అరుణ్, విఠల్, వివేక్, రావుత్ బేబితాయి, మురళి, సురేశ్, మస్కే తేజ్రావ్, వాడ్కర్ తేజ్రావ్, మండల ప్రత్యేకాధికారి శంక ర్, ఎంపీడీవో రవీందర్ పాల్గొన్నారు.