జైనథ్, మే 13 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే సీఎం కేసీఆర్ మన ఊరు- మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నా రని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్లోని ప్రాథమిక పాఠశాలలో అదన పు తరగతుల గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 22 పాఠశాలలు మన ఊరు- మన బడి కింద ఎంపికయ్యాయని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో 8వ తరగతి వరకు విద్యను అంది స్తున్నామన్నారు.
రూ.కోటి అందించే దాతల పూర్వీకుల పేర్లను పాఠశాలకు పెడుతారని పేర్కొ న్నారు. రూ.50 లక్షలు ఇస్తే ఒక బ్లాకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక తరగతి గదిపై పేరు పెడుతారని తెలిపారు. పాఠశాలలో సోలార్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత, అదనపు కలెక్టర్ నటరాజన్, ఎంపీపీ గోవర్ధన్, వైస్ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటర్రెడ్డి, గణేశ్యాదవ్, ప్రధానోపాధ్యాయుడు రాములు, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ లస్మన్న, ఎస్ఎంసీ చైర్మన్ పొచ్చన్న పాల్గొన్నారు.
మండలంలోని తరోడా(బీ) గ్రామానికి చెంది న 208 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కేవలం తెలంగాణలోనే జరుగుతున్నదని పేర్కొ న్నారు. దీనికి ఆకర్షితులై గ్రామగ్రామానా కాంగ్రె స్, బీజేపీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, నాయకులు చిన్నన్న, ప్రవీణ్, ప్రమోద్, అరవింద్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.