జైనథ్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దీపాయిగూడలో గురువారం అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న పంచశీల జెండాను ఎగురవేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంతో కార్యాలయంతో పాటు దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్రావు, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, సర్పంచ్ దేవన్న, గంగన్న, ఎంపీటీసీలు, సర్పంచ్లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలో నిర్వహించి కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి మంజుల- శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ నరేశ్, రఘు, అశోక్, నాయకులు గంగారాం, శ్రీనివాస్, మహేందర్,ధనుంజయ్ పాల్గొన్నారు. కప్పర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, ఎంపీటీసీ సంతోష్, మాజీ సర్పంచ్ నారాయణ పాల్గొన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో అంబేద్కర్ చిత్రపటానికి ఏఆర్ఎస్ ఇన్చార్జి డీ మోహన్ దాస్, శాస్త్రవేత్తలు ఎం రాజేందర్, అనిల్కుమార్, శ్రీనివాస్, ఉద్యోగులు మహేశ్, సుమిత్కుమార్, నరేశ్, పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 14: ఆదిలాబాద్ పట్టణంలో వివిధ సంఘాల నాయకులు, అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని కేఆర్కేకే కాలనీలో బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావి మొక్క నాటారు. కాలనీవాసులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దస్నాపూర్, పిట్టలవాడలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రిమ్స్ ఆసుపత్రి ఎదుట దుర్గం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, కౌన్సిలర్ ఆవుల వెంకన్న, నాయకులు శైలేందర్, రాందాస్, రమేష్, సుధాకర్, రాము, మోహన్ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్, నాయకులు తిరుమల్ రెడ్డి, కారింగుల మోహన్, చంద్రశేఖర్, కే అరుణ్ కుమార్, కలీం, ఫిరోజ్, ఓం ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, నాయకులు పడకంటి సూర్యకాంత్, బారడి లక్ష్మీకాంత్, లోలపు శ్రీనివాస్, దేవేందర్గౌడ్, సంతోష్,కందుల రవీందర్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బావునే నగేష్, శంకర్, నీత, మహేందర్ ,రమేశ్, సార్క్ జాతీయ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్ గుర్రం పున్నరావు, సురేశ్, బాలాజీ, గంగాధర్ పాల్గొన్నారు. విజయ డెయిరీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్రావు, డిస్ట్రిబ్యూటర్ నరేందర్, సిబ్బంది పోతలింగు, ఖధీర్,రమేశ్, ఊశన్న, రాము, లోకేశ్, సాయి, సతీశ్, అఖిల్ తదితరులు నివాళులర్పించారు.
స్వేరోస్ ఆధ్వర్యంలో, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుఅర్పించారు. కార్యక్రమాల్లో జిల్లా కార్యదర్శి పెంటపర్తి ఊశన్న, జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు సంతోష్, పసుల సంతోష్ పాల్గొన్నారు. అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కారదర్శి డీకే నాందేవ్, నాయకులు దేవ్రాజ్, సూర్యకాంత్, లక్ష్మణ్కాంబ్లే, మాజీ ఎంపీటీసీ సంతోష్, పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్ యాపల్గూడలో నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పీ కృష్ణ ప్రసాద్, ఆర్ఐలు,ఎస్ఐలు పాల్గొన్నారు.
బేల, ఏప్రిల్14 : అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీకార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లోని విగ్రహానికి జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎంపీపీ వనిత ఠాక్రే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మాజీ సర్పంచ్ మస్కేతేజ్రావు, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, నాయకులు ప్రమోద్ రెడ్డి, వాడ్కర్ తేజ్రావు పాల్గొన్నారు.
బోథ్, ఏఫ్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనకు పాటు పడదామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపు నిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్సలాం, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, నల్ల చిన్నయ్య, సాగర్, సంతోష్, కాంగ్రెస్ నాయకులు ఆడె గజేందర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఏప్రిల్ 14 :మండల కేంద్రంతో పాటు దేగామ, మోర్కండి, బజార్హత్నూర్, పిప్పిరి, వర్తమన్నూర్లో అంబేద్కర్, విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండా ఎగుర వేశారు. కార్యక్రమాల్లో నాయకులు నాయకులు కాప్సె అక్షయ్, రాజారాం, వినోద్, ఉద్ధవ్, ఉంఖండ్ రావు, లక్ష్మణ్, ప్రభు, ఆనంద్రావు పాల్గొన్నారు.
సిరికొండ, ఏప్రిల్ 14: మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ చంద్రకళ, సర్పంచ్లు చంద్రకళ,రఘురాం,శకుంతల, బీజేపీ అధ్యక్షుడు అమోల్, డీస్పీ కన్వీనర్ గురుమూర్తి, నాయకులు ఈశ్వర్, సూర్యకాంత్, రమేశ్ ఉన్నారు.
గుడిహత్నూర్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెమోరియల్ అధ్యక్షుడు మాధవ్ మస్కే, న్యాయవాది అజయ్ జోందలే పాల్గొన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో వేడుకలు జరిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ భరత్, జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, మాజీ ఎంపీటీసీ కాంబ్లే జ్యోతి, వినోద్, గోవింద్ బుద్దె, కిషన్ బుద్దె, సిద్ధార్థ్ ససానే, బడుగు రాజేశ్వర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జాదవ్ రమేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 14 : మండలంలోని అన్ని పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఉప సర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే కృష్ణ కుమార్, అరుణ్ కిల్లారే, దుబాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, కాశిపాక విష్ణు, కాశీనాథ్, మల్లేశ్, కంఠేశ్వర్, బాపురావ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 14 : మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచ్లు పెంట వెంకటరమణ,రాజు, ప్రఫుల్ చందర్రెడ్డి, జాదవ్ రమేశ్, మనీషా, అశోక్, రాజు యాదవ్, విశాల్, నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తలమడుగు, ఏప్రిల్ 14 : గ్రామ గ్రామాన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కజ్జర్లలో అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తలమడుగులో పలువురు నాయకులు ర్యాలీ నిర్వహించారు. రుయ్యాడి అన్నదానం చేశారు. సాయిలింగి వృద్ధాశ్రమానికి బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, నెలకు సరిపడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్, ఏప్రిల్14 : మండలంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ,ఎంపీపీ రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ రాధిక, సర్పంచ్లు జీ స్వాతిక, నిమ్మ వేణుయాదవ్, బక్కి లలిత, జి.రమాబాయి, కల్యాణి, జి.భూమన్న, నాయకులు జీ నరేందర్యాదవ్, మేకల నాగయ్య, భావురే గౌతమ్, యువజనసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.