నిర్మల్ అర్బన్/సారంగాపూర్, మే 12 : పోషకారహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు బృహత్ పల్లె ప్రకృతివనంలో గురువారం పోషక ఉద్యానవనాన్ని ప్రారంభించి విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకృతివనంలో పోషకావనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. పోషక విలువలతో ఆకు కూరలు, కూరగాయలు పండించడం ద్వారా గర్భిణులకు పోషకాహారం అందుతుందన్నారు.
ఇక్కడ పండించిన కూరగాయలు, ఆకు కూరలను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రయోగాత్మకంగా ఎకరం స్థలంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసిన డీఆర్డీవోను అభినందించారు. అంతకుముందు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూ జలు చేసి మొక్కులుచెల్లించుకున్నారు. కొను గో లు కేంద్రంలో వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చై ర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మా జీ చైర్మన్ రాజ్మహ్మద్, మాజీ మార్కెట్ కమి టీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో రాధ, తహసీల్దా ర్ సంతోష్రెడ్డి, నాయకుడు అల్లోల మురళీధర్రెడ్డి ఉన్నారు.