మారేడ్పల్లి : తాగుడుకు బానిసై జీవితం పై విరక్తి చెందిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మచ్చ బొల్లారం, కుమ్మర బస్తీ ప్రాంతానికి చెందిన పి. నాగరాజు (31) మద్యానికి బానిసగా మారారు.
దీంతో తాగడానికి అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 22న రా త్రి తల్లి, తండ్రి, సోదరుడితో గొడవ పడి రా త్రి10:30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం మద్యాహ్నం 12 గంటల సమయంలో బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. కాగా మృతున్ని కుటుంబసభ్యులు నాగరాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.