సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : నగర శివారులోని కొల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల మోడల్ టౌన్ షిప్కు సమృద్ధిగా నీటి సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమవుతున్నది. మౌలిక స దుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన పైప్లైన్ విస్తరణ పనుల ను జలమండలి ఎండీ దాన కిశోర్ శుక్రవారం పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం మోడల్ టౌన్ షిప్ ఫేజ్-1లో 2,052 ఇండ్లు, ఫేజ్-2లో 15,660 ఇండ్లకు జలమండలి మంచినీటి సర ఫరాను చేపట్టనున్నది. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న జలమండలి రింగ్ మెయిన్ నుంచి నీటిని అందించేందుకు దాదాపు 18 కిలోమీటర్ల పైప్లైన్ విస్తరణ పనులు పూర్తి చేసింది. కొల్లూరు సమీపంలో రైల్వే ట్రాక్ ఉండడంతో ట్రాక్కు ఇబ్బంది లేకుండా కింది నుంచి (అండర్ పాస్) పైప్లైన్ వేసే పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతిని ఎండీ దానకిశోర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రాజెక్టు ఉన్నతాధికారులు, రైల్వే అధికారులు ఉన్నారు.