కందుకూరు : ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని కందుకూరు మండల పరిషత్ చైర్ పర్సన్ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు అన్నారు. మండల పరిధిలోని మాదాపూరు రెవెన్యూ పరిధిలో 5ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మండల పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి వనాన్నిప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అడవులను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిందని అదే విధంగా మండల స్థాయిలో 5ఎకరాల్లో మండల ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ప్రకృతి వనాల వల్ల ప్రజలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆహ్లాదాన్ని పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, సర్పంచ్ మంద సాయిలు, ఎంపీడీఓ క్రిష్ణకుమారి, ఎంపీఎచ్వో విజయలక్ష్మీ, ఎపీఎం రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గణేష్, అందుగుల సత్యనారాయణ, బర్కం వెంకటేష్,సోషల్ మీడియా మండల కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి. పంచాయతీ కార్యదర్శి, అధికారులు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.