వెంగళరావునగర్ : బాలుడు అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ వీ.ఆర్ నగర్కు చెందిన ఎం.యాదగిరి కుమారుడు ఎం.శ్రీకాంత్(17) మంగళవారం మధ్యాహ్నం ఎవ్వరితోనూ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.
సాయంత్రమైన కుమారుడు కనిపించకుండా పోయేసరికి అతని ఆచూకీ కోసం బంధులతో పాటు ఇరుగుపొరుగు వారిని ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీకాంత్ తండ్రి యాదగిరి బుధవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.