సికింద్రాబాద్ : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ చెక్కులను అందజేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజురైన నిధుల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందించారు. అడ్డగుట్ట శాస్త్రీనగర్కు చెందిన పి. రాజుకు రూ. 2లక్షలు, వెంకట్నగర్ ప్రాంతానికి చెందిన రాజలింగంకు రూ. 3లక్షలు, ఆదే విధంగా అడ్డగుట్టకు చెందిన యాస్మిన్కు రూ.2.5లక్షలు, అడ్డగుట్ట ఏసీఎస్ నగర్ ప్రాంతానికి చెందిన పూస పద్మకు సుమారు రూ. 80 వేలు విలువజేసే ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట పెన్నిదిగా మారిందన్నారు. పేదవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని గుర్తు చేశారు. మానవతా దక్ఫథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నారని తెలిపారు.
పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్తో పాటు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.