పెద్దశంకరంపేట, జనవరి 30: మహాత్ముడి సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ మహత్మాగాంధీ చూపిన బాటలో నడవాలని, ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో దేశ ప్రజలను చైతన్యవంతం చేశాడని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, మం డల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొడ్ల ప్రకాశం, మండల ఆర్యవైశ్య యూత్ అధ్యక్షుడు కందుకూరి రవీందర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి టి. రవీందర్, ఆర్యవైశ్య నాయకులు అనిల్, వెంకటేశం, మల్లేశం, రఘు, శేఖర్, రాజేశ్ తదితరులున్నారు.
జిల్లా కేంద్రంలో
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 30: మహాత్మగాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లోని గాంధీ విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంగలి అడివయ్య పాల్గొన్నారు.