ధరూర్, నవంబర్ 29 : రైతు పక్షపాతి కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నంత కాలం సాగు సంబురంగానే ఉంటుందని జెడ్పీటీసీ పద్మ అన్నారు. మండలంలోని అల్వాల్పాడ్ గ్రామంలో ఎంపీపీ నజుమున్నిసాబేగంతో కలిసి ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులు గురిచేస్తున్నా సీఎం కేసీఆర్ రైతుల కొండంత అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరన్నగౌడ్, ఏఈవో శివరాజ్, ఐకేపీ సిబ్బంది నవీన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్ మండలంలో..
మల్దకల్, నవంబర్ 29 : మండలకేంద్రంలోని కుర్తిరావుల చెర్వు గ్రామ సమీపంలోని ప్రభుత్వ గోదాంల వద్ద ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎంపీపీ రాజారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ముందుగా ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలన్నారు. అలాగే బిజ్వారం, పెద్దపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో రాజశేఖర్, సర్పంచ్ జయమ్మ, వైస్ ఎంపీపీ పెద్దవీరన్న, జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహేశ్, పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు విక్రంసింహారెడ్డి, జనార్ధన్రెడ్డి, అజయ్, భాస్కర్గౌడ్, ఆంజనేయులు, రామచంద్రారెడ్డి, మహబూబ్అలీ, ప్రదీప్రెడ్డి, శివారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కర్ణ, లక్ష్మన్న, ఏఈవోలు ఖాజా, రాహుల్, పాషా, కిశోర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
గట్టు, నవంబర్ 29 : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని పీఏసీసీఎస్ చైర్మన్ క్యామ వెంకటేశ్ సూచించారు. ఉమ్మడి గట్టు మండలంలోని పెంచికలపాడు, ఆలూరు, చింతలకుంట, మాచర్ల, ఇందువాసి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం స్థలాలను ఆయన పీఏసీసీఎస్ డైరెక్టర్లు, సిబ్బందితో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీసీఎస్ చైర్మన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ సిబ్బంది ఇస్మాయిల్ బేగ్, నర్సింహులు, ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు పక్కాగా చేపట్టాలి
అయిజ, నవంబర్ 29 : ప్రస్తుత వానకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోలును పక్కాగా చేపట్టాలని సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయంలో వ్యవసాయాధికారి శంకర్లాల్తో కలిసి ఏఈవోలతో సమావేశం నిర్వహించారు. మండలంలో 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం వస్తుండటంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.