అర్హులందరికీ రేషన్కార్డులు
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ఆత్మకూరు, జూలై 28 : నిరుపేదల కడుపు నింపడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయ న హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. బహుళ ప్రయోజనాలు అందించే రేషన్కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధుపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయ ని విమర్శించారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు
జిల్లా వ్యాప్తంగా అర్హులందరికీ రేషన్కార్డులు అందజేస్తున్న ట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా పేర్కొన్నారు. ఆత్మకూరులో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,57,404 రేషన్ కార్డులు ఉన్నాయని వీటి ద్వారా 5.57లక్షల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న రేషన్కార్డులు జిల్లా లో 3,302 మంజూరయ్యాయని, ఆత్మకూరు మండలానికి 346 కార్డులు మంజూరయ్యాయని ఆమె పేర్కొన్నారు. పా త రేషన్ కార్డుదారులకు ఒకొక్కరికీ 15 కేజీలు, కొత్త రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
ఆత్మకూరు, జూలై 28 : మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. బుధవారం స్థానిక పరమేశ్వరస్వామి చెరువు పక్కన 2వ వార్డులో సర్వే నెంబర్ 513/ఏ నూతనంగా వెలసిన శ్రీహరిహరపుత్ర రియల్ ఎస్టేట్లోని 10 శాతం మున్సిపాలిటీ స్థలంలో వారు హరితహా రం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయన్నారు. వర్షాలు మెండుగా కురువాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వెంచర్ మొత్తంగా మొక్కలు నాటించాలని వెంచర్ డెవలపర్ కాడిగి గణేశ్(శ్రీనివాసులు)కు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, మున్సిపల్ చైర్పర్సన్ గా యత్రీయాదవ్, వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మహమ్మూద్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తా సిల్దా ర్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్, నాయకులు వీరేశలింగం, అనిల్గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.