పదవి కాదు.. టీఆర్ఎస్ శ్రేయస్సే లక్ష్యం
సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి
మంత్రి సింగిరెడ్డి సూచనలు తీసుకుంటా
ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్
వనపర్తి, జనవరి 28 (నమస్తే తెలంగా ణ) : పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మో సిన నాయకుడికే సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో తమ బాధ్యతగా పోరాడిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ క్రమంలో పార్టీని నమ్ముకున్న నాయకుడు ఏర్పుల గ ట్టు యాదవ్కు పార్టీ సముచిత స్థానాన్ని క ల్పించారు. వనపర్తి జిల్లాలో ఎంతోమందికి పలుకుబడి ఉన్నా.. ఉద్యమ నాయకుడికే ప గ్గాలు ఇచ్చారు. మొదటిసారి మున్సిపల్ కౌ న్సిలర్గా అవకాశమిచ్చిన పార్టీ.. రెండోసారి కూడా అదే బాధ్యతలు అప్పగించింది. ఇ ప్పుడు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అ వకాశమిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జి ల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్ల ను కేటాయించగా.. వనపర్తిలో మాత్రమే మున్సిపల్ చైర్మన్ను నియమించారు. మొద టి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టుకొని.. ల క్ష్యం నెరవేరే వరకు ఉద్యమించడమే ఇందు కు కారణం. ఉద్యమ సమయంలో సామాన్యుడిగా ఉన్న గట్టు యాదవ్కు పార్టీ అగ్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు అప్పిజెప్పిన నేపథ్యంలో ఆయనను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
నమస్తే తెలంగాణ : జిల్లా అధ్యక్షుడిగా కేటాయించినందుకు ఎలా భావిస్తున్నారు..?
గట్టు యాదవ్ : పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాను. నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించా. నాకు అప్పజెప్పిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తించాను. నా మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ని యమించినందుకు చాలా సంతోషంగా ఉ న్నది. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటా. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. పదవి రావడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. ఓపికతో పనిచేస్తే నాయకత్వం గుర్తిస్తుంది.
నమస్తే తెలంగాణ : మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఎలా సమన్వయం చేసుకుంటారు..?
గట్టు యాదవ్ : మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల సమ్మతితోనే న న్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారని భా విస్తున్నాను. ఉద్యమకారుడు, మంత్రిగా ఉ న్న నిరంజన్రెడ్డి సలహాలు తీసుకుంటాను. పార్టీ నిర్ణయాల్లో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముందుకెళ్తాను.
నమస్తే తెలంగాణ : భవిష్యత్ ప్రణాళిక ఏంటి.. పార్టీని ఎలా నడిపించనున్నారు..?
గట్టు యాదవ్ : పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. నాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా నిలుబెట్టేందుకు కార్యకర్తలు, నాయకులను కలుపుకొని ముందుకెళ్తాను. నేను ఎవ్వరికీ పోటీకాదు.. పార్టీ ఇచ్చిన బాధ్యతను సా మాన్య కార్యకర్తలా నిర్వర్తిస్తాను. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం. టీఆర్ఎస్ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తా.
నమస్తే తెలంగాణ : పార్టీనీ సంస్థాగతంగా ఎలా పటిష్టం చేయబోతున్నారు..?
గట్టు యాదవ్ : త్వరలో జిల్లా కమిటీలు వేస్తాం. మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తల అ భిప్రాయాలు, సూచనలు తీసుకుంటాను. ముఖ్యంగా మంత్రి నిరంజన్రెడ్డి సూచనల కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ పనితీరు, నాయకుల వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు బాధ్యతగా స్టేట్ కమిటీ దృష్టికి తీసుకెళ్తాను. పార్టీ వ్యవహారాల్లో నా సొంత ఎ జెండా ఉండదు. పార్టీ బాగుంటేనే నేనూ బాగుంటా అని నమ్ముతా. సామాన్యుడిగా ఉన్న నన్ను టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ చై ర్మన్ను చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని వి ధంగా చిన్న పదవిలో ఉన్నప్పటికీ.. జిల్లా అ ధ్యక్ష పదవి కట్టబెట్టింది. మా నాయకుడు కే సీఆర్ ఉద్యమం చేపట్టినప్పుడు తెలంగాణ వచ్చేదా.. చచ్చేదా.. అని అన్నారు. చూశారు కదా.. ఓపికతో ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. సీఎంగా కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. టీఆర్ఎస్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఉంటుంది.