నాలుగు చోట్ల వంతెనల నిర్మాణం
దశాబ్దాల సమస్యకు పరిష్కారం
దస్తురాబాద్, జూన్27 : మండలంలో ని బుట్టాపూర్లో రెండు కాలనీల మధ్య కల్వర్టులు నిర్మించడంతో కాలనీ వాసుల ఇబ్బందులు తీరాయి. గ్రామంలోని రెండు కాలనీ
లను వేరు చేస్తూ చిన్న వాగు వెళ్తుంది.సమస్య తీర్చేందుకు చిన్న వాగుపై కల్వర్టుల నిర్మాణాలను పంచాయతీ నిధులతో సర్పంచ్ బాదం నిరోషా పనులు చేపట్టా రు.దీంతో దూరం భారం తగ్గడంతో ఇరు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన దూరం ..
గ్రామంలో ఏర్పడిన చిన్న వాగుతో ఎస్సీ, బీసీ కాలనీలు విభజించినట్లుగా మారాయి. వర్షం పడినప్పుడు వాగులో వరద ప్రవహించినప్పుడు ఇరు కాలనీల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. వివిధ అవసరాలు, ఇతర పనులను బస్టాండ్ మీదుగా కిలో మీటరు దూరం మేర తిరిగి వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలో మొత్తం 4 కాలనీల మధ్య గుండా వెళ్తున్న చిన్న వాగుపై పంచాయతీ నిధులతో ఒక్క కాలనీ మధ్య కల్వర్టుల నిర్మాణంతో రెండు కాలనీల మధ్య దూరం తగ్గింది. ఆయా కాలనీల వాసుల రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలకు పరిష్కారం చూపినట్లయ్యింది.
రూ. 14లక్షలతో నిర్మాణాలు
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు నిధులు కేటాయిస్తుంది. ఈ నిధుల్లోంచి రూ.14 లక్షలు వెచ్చించి చిన్న వాగుపై 4 కల్వర్టులు నిర్మించారు. ఒక్కో కల్వర్టును రూ 3.50 లక్షలతో చేపట్టారు.