అధునాతన పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
రైతులకు రాయితీపై పరికరాల పంపిణీ
నిర్మల్ అర్బన్, మే 27 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా 50 శాతం రాయితీపై రైతులకు వ్యవ సాయ పరికరాలు, పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అధునాతన వ్యవసాయ పనిముట్లను ఉపయోగించుకుని దిగుబడిని పెం చుకోవాలని తెలిపారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు పరుస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, నాయకులు వంగ రవీందర్ రెడ్డి, ముత్యం రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మన్ చందు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయండి..
నిర్మల్లోని శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులను వేగ వంతం చేయాలని మున్సిపల్ అధికారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, చైర్మన్ ఈశ్వర్ పూల మొక్క ను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంత రం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో వేగ వంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, పూదరి రాజేశ్వర్, నాయ కులు సల్మాన్, శ్రీధర్ తదితరులున్నారు.