జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నార్నూర్లో సామాజిక ఆరోగ్యం కేంద్రం ఆకస్మిక తనిఖీ
ఇంటింటి సర్వేపై ఆరా
నార్నూర్, మే27 : కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యమందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ వైద్యశాఖ అధికారులకు సూచించారు. గురువారం నార్నూర్ మండలంలోని సామాజిక ఆరో గ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీ పరిసరాలు,గదులతో పాటు కొవిడ్ నిర్ధారణ పరీక్ష గది పరిశీలించారు. కొవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించే తీరును అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ ఇంటింటా సర్వేపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని విజయ్నగర్లో బాధిత ఇంటింటికీ తిరిగి సర్వే సిబ్బంది వచ్చారా? ఆరో గ్య వివరాలు సేకరించారా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. సర్వే టీమ్లో ఎంత మంది ఉన్నారని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. కొవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి, వారికి కిట్లు అందజేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. వైద్య సిబ్బంది కొరత ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని ఎస్ఐ డీ రమేశ్కు ఆదేశించా రు. ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్,ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, ఎంపీవో స్వ ప్నశీల, హెచ్ఈవో చౌహన్ నాందేవ్, సిబ్బంది ఉన్నారు.