టీఎన్జీవోస్ సెంట్రల్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా అఫ్జల్హసన్ ఏకగ్రీవ ఎన్నిక
ఖమ్మం, డిసెంబర్ 26: 75 ఏళ్లుగా ఉద్యోగుల హకుల సాధన కోసం కృషి చేస్తున్న సంఘం టీఎన్జీవోస్ మాత్రమేనని ఆ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడి నియామకంలో భాగంగా ఆదివారం నగరంలోని గ్రాండ్ గాయత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మట్లాడారు. ఉద్యోగులు మెరుగ్గా జీవించడానికి 11వ పీఆర్సీ, తొలి పీఆర్సీ వర్తిస్తుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు టీఎన్జీవోస్ అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏడున్నర శాతం సిఫార్సు చేయడంతో దానిని పెంపుదల కోసం ఉద్యోగుల పక్షాన నిలిచామన్నారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయనను ఒప్పించి 30 శాతానికి పెంచేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
మంత్రి సహాయం కోరదాం.. : యూనిట్ల ఎంపిక కోసం ఆరు నెలలు గడువు ఇవ్వగా టీఎన్జీవోస్ జిల్లా కన్వీనర్ అఫ్జల్హసన్ వాటిని నెలలోపే పూర్తి చేసి సమర్థత నిరూపించుకున్నారని రాజేందర్ గుర్తుచేశారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా మంత్రి అజయ్కుమార్ సహాయం కోరదామన్నారు. అనంతరం సెంట్రల్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ అఫ్జల్హసన్తో సంఘానికి నూతన ఒరవడి రావాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంకిషన్ రావు, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి సదానంద్, సెంట్రల్ కోశాధికారి కొణిదల శ్రీనివాస్ హాజయ్యారు.
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా అఫ్జల్హసన్ ఏకగ్రీవం
టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ అఫ్జల్హసన్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చుంచు వీర నారాయణతో కలిపి 18 మంది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సుజాతనగర్ తహసీల్దార్ సునీల్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.