ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
10మందికి చెక్కులు అందజేత
చెక్కుల జాప్యంపై అధికారులతో సమీక్ష
ఆదిలాబాద్ రూరల్, మే 26 : పేదల ఇండ్లల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ కల్యాణ ల క్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నా రు. బుధవారం మండలంలోని అంకోలి గ్రామం లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 10 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1,00,116 చొప్పున అందిస్తూ వారి కుటుం బాల్లో ఆనందం నింపుతున్నారని పేర్కొన్నారు. సర్పంచ్ ఇటిక్యాల భూమన్న, నాయకులు కనక రమణ, రాము పాల్గొన్నారు.
ఆదివాసుల సంక్షేమానికి కృషి..
జిల్లాలోని ఆదివాసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామ న్న పేర్కొన్నారు. మండలంలోని చించుఘాట్ గ్రామంలో సోనేకర్ కుమ్రం వారి పెర్సపేన్ నూత న మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లను వేసి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఎంపీటీసీ కుమ్రం జంగుబాపు, పీఏసీఎస్ చైర్మన్ మెస్రం పరమేశ్వర్, గ్రామ పటేల్ కుమ్రం రాజు, నాగోరా వ్ రాము, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్ యాద వ్, ఆరె నరేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నెల రోజుల్లోనే చెక్కులు ఇవ్వాలి
పెళ్లి అయిన నెల రోజుల్లోనే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజే యాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశించారు. జిల్లా జడ్పీ చైర్మన్ చాంబర్లో ఆర్డీ వో జాడే రాజేశ్వర్తో కలిసి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడు తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. కొంత మంది చెక్కులు రాలేదని, పెళ్లి అయి ఆరేడు నెలలు గడుస్తున్నా ఇంకా రావడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. నిధులు ఉన్నా చెక్కులు ఇవ్వడంలో ఎందుకు అలస్యం అవుతున్నదని అధికారులు వివరించాలని సూచిం చారు. ఇక నుంచి లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బం దులకు గురిచేయకుండా పెళ్లి అయిన నెల రోజు ల్లో చెక్కులు అందజేయాలని ఆదేశించారు. ఇందులో డీటీవో రాజేశ్వర్, బ్యాంక్ మేనేజర్, సిబ్బంది చంద్రమెహన్రెడ్డి రోహిత్ పాల్గొన్నారు.