ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మరోసారి అధ్యక్ష పదవి
నాగర్కర్నూల్కు గువ్వల, గద్వాలకు బండ్ల, పేటకు రాజేందర్రెడ్డి
వనపర్తిలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్కు బాధ్యతలు
మహబూబ్నగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్.. పార్టీ పటిష్టతపై మరింత దృష్టి సారించింది. అందులో భాగంగా అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాద్మి శివకుమార్ ఇప్పటి వరకు పార్టీ బా ధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రతి జిల్లాకు అధ్యక్షుడిని నియమించడం.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు ఇవ్వడం విశేషం. గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమం లో కీలకంగా పనిచేసిన అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు నాగర్కర్నూల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. నారాయణపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసి కార్యకర్తలకు అండగా నిలుస్తున్న ఎస్. రాజేందర్రెడ్డికి పేట జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అవకాశం కల్పించింది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దులుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పార్టీని బలపేతం చేసే బాధ్యతను నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్రెడ్డిపై పెట్టింది. కార్యకర్తల వెన్నంటి ఉండే కృష్ణమోహన్పై పార్టీ ఎంతో భరోసా ఉంచి అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఇక వనపర్తి జిల్లాలో పార్టీ కో సం ఆది నుంచి పనిచేస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్కు అవకాశం దక్కింది. ఇప్పటికే పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన గట్టు యాదవ్కు ఆ అనుభవం ప్రస్తు తం ఎంతో ఉపయోగపడనున్నది.
పార్టీ బలపేతంపై ప్రత్యేక దృష్టి..
ఇన్నేండ్లు పాలనపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత ఇప్పు డు పార్టీపైనా ప్రత్యేక దృష్టి సారించారని భావించవ చ్చు. అయిదు జిల్లాలకు అధ్యక్షులను నియమించగా వ నపర్తి జిల్లా మినహా అన్ని జిల్లాల అధ్యక్షులు ఎమ్మెల్యేలే కావడం విశేషం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కొత్త అధ్యక్షుల ఎన్నిక ఎంతో కీలకమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2001లో పార్టీ స్థాపించిన త ర్వాత ఇప్పటి వరకు ఆరుగురు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న బాద్మి శివకుమార్ కంటే ముందు విఠల్రావుఆర్యా ఉన్నారు. అంతకుముం దు ఉద్యమ సమయంలో ఒకసారి జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ బాధ్యతలు కూడా మోశారు. ఇప్పుడు తిరిగి మరోసారి ఆయనను మహబూబ్నగ ర్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా అధిష్టా నం నియమించింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గత ఫలితాలు రిపీట్ చేసేందుకు ఈ ఎంపిక సరైన నిర్ణయంగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వివాద రహితులు, పార్టీపై గట్టి ప ట్టున్న వారినే అధ్యక్షులుగా నియమించడం పార్టీకి అదనపు బలంగా మారనున్నదని చెబుతున్నారు.
ఎన్నికలే లక్ష్యంగా..
ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో కమిటీలు పూర్తయ్యాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్న అధ్యక్షులే ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లాలకు అధ్యక్షుల నియామకం ఇప్పుడే జరిగింది. ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉందో పార్టీని కూడా అంతే పటిష్టంగా తీర్చేదిద్దే బాధ్యత కొత్త అధ్యక్షులపై ఉందని పార్టీ నేతలు అం టున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే ల క్ష్యంగా అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుతూ వస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి చూస్తే ప్రతి ఎ న్నికల్లోనూ అధికార పార్టీదే విజయం. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఐదు జెడ్పీ లు, 99 శాతం ఎంపీపీ పదవులు, పీఏసీఎస్, డీసీసీబీ.. ఇలా ఎటు చూసినా అన్నింటా అధికార పార్టీ నాయకు లే పదవులు కైవసం చేసుకున్నారు. అధికార పార్టీకి ప్రజ ల్లో ఉన్న ఆదరణకు ఇదే పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యం లో రాబోయే ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో ఘన విజ యం సాధించేందుకు పార్టీ పెద్దలు జిల్లాలకు అధ్యక్షుల ను నియమించారు. పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేశా రు. సమర్థులైన వారికే పదవులు కట్టబెట్టారని పార్టీ నేత లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రియాశీల వ్యక్తులకే బా ధ్యతలు అప్పగించి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. రాబోయే ఎ న్నికలకు పార్టీని అన్ని విధాలా సిద్ధం చేసేందుకు ప్ర స్తుతం అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న వారు కృషి చే యనున్నారు. జిల్లాల్లో పార్టీకి సంబంధించి సకల బా ధ్యతలు వీరే నిర్వర్తిస్తారు. ఉమ్మడి జిల్లాలో అందరు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కగా.. కేవలం వనపర్తిలో మాత్రమే పార్టీలో సీనియర్ అయిన మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్కు అధ్యక్షుడిగా అవకాశం వరించింది.