నిరాడంబరంగా రిపబ్లిక్ డే
వనపర్తిలో జెండావిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
నెట్వర్క్ మహబూబ్నగర్, జనవరి 26 ; గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బుధవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఉమ్మడి జిల్లావాసుల మది జాతీయ భావంతో ఉప్పొంగింది. భారతమాతకు జేజేలు అంటూ నీరాజనం పలికారు. భారత రాజ్యాంగం విశిష్టతను తెలుసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వనపర్తి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కలెక్టరేట్ల ఎదుట కలెక్టర్లు వెంకట్రావు, ఉదయ్కుమార్, హరిచందన, షేక్ యాస్మిన్ బాషా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అచ్చంపేటలో జరిగిన జెండా పండుగలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి 12 మెట్ల కిన్నెర వాయిధ్యకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాలు, విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాల ఎదుట జెండా ఎగిరింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లాలో
బుధవారం ఘనంగా నిర్వహించారు.. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్లు ఎస్పీలతో కలిసి జెండా ఎగరవేశారు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.. వనపర్తి క్యాంప్ ఆఫీస్లో
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నియోజకవర్గాల కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు జెండావిష్కరణ చేశారు.. మహనీయులను స్మరించుకున్నారు.. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు, ఆఫీసుల్లో త్రివర్ణ శోభితం సంతరించుకున్నది..