సారికా టౌన్షిప్లో మిగిలిన ప్లాట్లకు ఓపెన్ పద్ధతిలో ఆక్షన్
భూత్పూర్ మున్సిపాలిటీకి రాజీవ్ స్వగృహ నిర్వహణ బాధ్యత
సారికా టౌన్షిప్ను పరిశీలించిన కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ జనవరి 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ రాజీవ్ స్వగృహ టౌన్షిప్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి బుధవారం టౌన్షిప్ను సందర్శించారు. స్వగృహకు ఇతర పట్టణాల మాదిరిగానే విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. ప్రస్తుతం అందుతున్న మిషన్ భగీరథ నీటిని రెట్టింపు స్థాయిలో సరఫరా చేయాలని సూచించారు. పట్టణప్రగతి నిధులతో సర్వాంగ సుందరంగా పార్కును ఏర్పాటు చేయాలన్నారు. ఇకపై ఈ టౌన్షిప్ భూ త్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని.. నిర్వహణ మున్సిపాలిటీయే చూస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్- భూత్పూర్ ప్రధానరహదారిపై ఉన్న రాజీవ్ స్వగృహ సారికా టౌన్షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి భూత్పూర్ మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓపెన్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీవరకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. రూ.1180 రిజిస్ట్రేషన్ ఫీ జు ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ http s://www.mstcecommerce.com లేదా http:// auction.hmda.gov.in ద్వారా ఆక్షన్లో పాల్గొనవచ్చన్నారు. యాక్షన్ నోటీస్ వచ్చిన తర్వాతే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 16,18 తేదీల్లో ఉదయం 9నుంచి సా యంత్రం 5గంటల వరకు ఆక్షన్ ఉంటుందని, ఇతర వివరాలను టౌన్షిప్ వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. టీఆర్ఎల్సీ ద్వారా ఫిబ్రవరి 7నుంచి 14వరకు సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట భూత్పూర్ తాసిల్దార్ చెన్నకిష్టన్న, మున్సిప ల్ కమిషనర్ నూరుల్ నజీబ్ ఉన్నారు.