మక్తల్ టౌన్, జనవరి 26: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ స్థలం కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తపస్ సభ్యులు 317జీవోను సవరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో బిల్డర్ తాయప్ప, కావలి ఆంజనేయులు, రవీందర్, భీంరెడ్డి, నర్సింహులు, నాగార్జున, కిశోర్, జగదీశ్, రాకేశ్, రామాంజనేయులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో పాల్గొనాలి
మక్తల్ టౌన్, జనవరి 26: యువత క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొనాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మినీస్టేడియంలో కల్నల్ సంతోష్ బాబు స్మారకార్థం ఆర్గనైజర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన టోర్నమెంట్ ముగింపునకు ఆయన హాజరయ్యారు. గెలుపొందిన అయ్యప్ప లెవన్ మహబూబ్నగర్ జట్టుకు ప్రథమ బహుమతి రూ.50వేల నగదును, ద్వితీయ బహుమతిగా టైటానిక్ మక్తల్ జట్టుకు రూ.25వేల నగదుతో పాటు కప్ను ఎమ్మెల్యే అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది బ్యాట్స్మన్ బెస్ట్ టోర్నమెంట్గా గణేశ్, టోర్నమెంట్ బెస్ట్ బౌలర్గా సద్దాం నిలిచాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ యువతకు క్రీడలు నిర్వహించుకునేందుకు ఎనిమిది ఎకరాలు స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, క్రీడాకారులు శివాజీ, లక్ష్మణ్, రంజాన్, యాదయ్య, అశోక్, నర్సింగ్, ఆంజనేయులు, సోంభూపాల్ గౌడ్ పాల్గొన్నారు.
జీపీ నూతన భవనం ప్రారంభం
కృష్ణ, జనవరి 26: మండలంలోని కుసుమూర్తి నూతన పంచాయతీలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించి బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుకామోనేశ్, ఎంపీపీ పూర్ణిమాపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, వైస్ ఎంపీపీ ఈశ్వర్పాటిల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు విజయ్పాటిల్, మహిపాల్రెడ్డి సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.