ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, జనవరి 26: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో జెండావిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కలిసిరావాలిని ఎమ్మెల్యే కోరారు. అనంతరం భూత్పూర్ చౌరస్తాలో మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్తోపాటు సిబ్బంది చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి జాతీయ నాయకుల బొమ్మలను, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేసిన చిత్రాలను చూసి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీడీవో మున్ని, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, కమిషనర్ నూరుల్నజీబ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, సాయిలు, అజీజ్, బోరింగ్నర్సింహులు, గడ్డరాములు పాల్గొన్నారు.
కార్యకర్తలకు పార్టీ అండ..
కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గతంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొని మృతిచెందిన రాములకు, కరివెన గ్రామంలో హన్మంతుకు వేర్వేరుగా రూ.2లక్షల చెక్కులను అందజేశారు. అదేవిధంగా మండలంలోని లంబడికుంటతండాలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే తన నిధులను రూ.4లక్షల నిధులను మంజూరు చేస్తూ పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ కేంద్రంలో యాదవ భవన నిర్మాణానికి రూ.2లక్షల ప్రొసిడింగ్ను అందజేశారు. పోతులమడుగు గ్రామ పరిధిలోని ముత్యాలంపల్లిలో 15రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందిన రాఘవబాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెల్కిచర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వెంకటయ్య కుమారుడు రంగయ్యకు రూ.లక్ష ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, సర్పంచ్ కమలమ్మ, ఎంపీటీసీ రజిని, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, సాయిలు, మన్య, యాదిరెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.