పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా?
ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐఎం, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదు
ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారు..?
బీజేపీపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్
నాగర్కర్నూల్, జనవరి 25 (నమస్తే తె లంగాణ) : మన ఊరు-మన బడి పథకం ద్వారా తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలో ఆదర్శంగా నిలవనున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐఎం, మెడికల్ కశాళాలలు ఇవ్వకపో గా.., ఐటీఐఆర్ను రద్దు చేసిన బీజేపీ నేతలు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలియేటివ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తగ్గట్లుగా తీర్చిదిద్దేందుకు సీఎం కే సీఆర్ బడ్జెట్లో నిధులు కేటాయించిన ట్లు తెలిపారు. ఏసీడీపీ, ఎమ్మెల్యేలు, నాబార్డ్, ఎస్ఎస్ఏ, రాష్ట్ర ప్రభు త్వం నుంచి నిధులు సమకూర్చారన్నారు. ఎమ్మెల్యేల నుం చి ప్రతిపాదనలు తెప్పించుకొని రెండు దశల్లో పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తామన్నారు. డిజిటల్ క్లాస్ రూంలు, డ్యూయల్ డెస్క్లు, ఫర్నీచర్, ప్రహరీ లు, అదనపు తరగతి గదులు, తాగునీరు, టాయ్లెట్ల వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చె ప్పారు. కార్పొరేట్లకు తలొగ్గే రాజకీయ పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. దేనికి విమర్శించాలో, స్పందించాలో కూడా తెలియని గుడ్డి వ్యతిరేకత బీజేపీలో చూస్తున్నామన్నారు. అద్భుతమైన కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేకపోతుందని, ఈ అక్కసు ఎందుకో అర్థమైతలేదన్నారు. పేదలు బాగుపడొద్దు.., ఇంగ్లిష్ మీడియం చదువులు వ ద్దు..? మరి ఏం కావాలో స్పష్టంగా చెప్పాలని డి మాండ్ చేశారు. మంచి చేస్తుంటే కూడా జీర్ణించుకోలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పథకానికి అడ్డు తగులుతూ పబ్బం గడుపుకోవడమే వా రి దినచర్యగా మారిందన్నారు.
ఏది మంచి, ఏది చెడు అన్న ఇంగింత జ్ఞానం, సోయి లేకుండా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని స్థాయి దిగజార్చుకుంటున్నారు. నాగర్కర్నూల్, వనపర్తిలో త్వ రలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రా ష్ట్రంలో 32 పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చే యగా.. నాగర్కర్నూల్లో 20వ కేంద్రమన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ను కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారని చెప్పారు. నా డు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాయకుడూ ఏమీ చేయలేకపోయాడన్నారు. నాగర్కర్నూల్లో 900 పడకల దవాఖాన, రూ.500 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మార్చి నెలాఖరుకు 300 పడకల ద వాఖానను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ స్టాఫ్, పీజీ స్టూడెంట్ల కేటాయింపులు జరిగాయన్నారు. మెడికల్ కళాశాల భవనాలు, తరగతి గదులు, హా స్టళ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరె డ్డి, కమిషనర్ వాకాటి కరుణ, మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్లు ఉదయ్కుమార్, షేక్యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ మ నూచౌదరి, అధికారులు పాల్గొన్నారు.