అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ఎజెండానా?
పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా..?
రూ.7,280 కోట్లతో ‘మన ఊరు-మన బడి’
దేశానికే దిక్సూచిగా తెలంగాణ విద్యావ్యవస్థ
వైద్యసేవల్లో దేశంలోనే మన రాష్ట్రం ఉత్తమం
రాష్ట్రంలో 8 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు
భవిష్యత్లో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ
వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సాగునీటికి ఢోకా లేదు మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/వనపర్తి రూరల్ : ‘బీజేపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ఎజెండానా..? పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా..? తెలంగాణలో రూ.7,280 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో మన విద్యావ్యవస్థ దేశంలో ఆదర్శంగా నిలవబోతున్నది.. దేశానికి దిక్సూచిగా మారనున్న మన విద్యావ్యవస్థ.. వైద్య సేవల్లోనూ దేశంలో ఉత్తమం.. సీఎం కేసీఆర్ ఇంత చేస్తున్నా రాష్ర్టానికి రావాల్సిన ట్రైబల్ యూనివర్సి టీ, ఐఐఎం, మెడికల్ కళాశాలలు ఇవ్వకపోగా, ఐటీఐఆర్ను రద్దు చేసిన కమలం పార్టీ నేతలు ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు’.. అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మంగళవారం వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్లో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఇస్తామన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్కు మాటలెక్కువ.. పని తక్కువ అని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. వనపర్తి జి ల్లాలో రూ.17 కోట్లతో నిర్మించిన 180 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రంతోపాటు 20 పడకల నవజాత శి శు కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతు న్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందన్నా రు. దేశ వ్యాప్తంగా 153 వైద్య కళాశాలలను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదన్నారు. సీఎం కేసీఆర్ ఒకేసారి 8 కాలేజీలు మంజూరు చేశారన్నారు. రూ.1500 కోట్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మూడు కళాశాలలు, రూ. 200 కోట్లతో నాలుగు నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. భవిష్యత్లో జి ల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ ఉత్తమంగా నిలిచిన విషయాన్ని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని వెల్లడించారు. కేరళ మొదటి, తమిళనాడు రెండు, తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. భవిష్యత్లో నెంబర్వన్గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయని, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాలో ఒ క్క డయాలసిస్ కేంద్రం కూడా లేదని, ప్రస్తుతం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకో టీ డయాగ్నొస్టిక్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వనపర్తి జిల్లా, మంత్రి నిరంజన్రెడ్డిపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉన్నదన్నారు. సిద్ధిపేటలో సుభాష్ రోడ్డు విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో తనకు తెలుసని, ఏడాదిన్నర సమయం పట్టిందన్నారు. వనపర్తిలో ఆరు రహదారులు నాలుగు లేన్లుగా విస్తరించేందుకు చేస్తున్న మంత్రి నిరంజన్రెడ్డి కృషి అభినందనీయమని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, తన సహకారం సంపూర్ణంగా ఉం టుందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రసూతి దవాఖానలు..
రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి దవాఖానలు, రూ.30 కోట్లతో 305 ఆపరేషన్ థియేటర్ల ని ర్మాణం చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వనపర్తి ప్రసూతి దవాఖానతో 13 ప్రారంభించుకున్నామని, ఐదారు మాసాల్లో మరో పది పూర్తవుతాయన్నా రు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 52 శాతానికి పెరిగిందన్నారు. కేవలం 18 మాత్రమే ఉన్న నవజాత శిశు కేంద్రాలను 65కు పెంచినట్లు చెప్పారు. మాతాశిశు మరణాలను 25 శాతం నుంచి 16 శాతానికి తగ్గించామని, ఇది జా తీయ సగటు 22తో పోలిస్తే తక్కువన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.5 లక్షల వైద్య సేవలు అందుకునేలా సీఎం కేసీఆర్ ఆదేశించారని, గతంలో ఇది రూ.2 లక్షల పరిమితితో ఉండేదన్నారు. టీనేజర్ల వ్యాక్సినేషన్లో జి ల్లా 90 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కృషి అభినందనీయమన్నారు.
జ్వర సర్వేకు సహకరించాలి..
జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో 1.27 కోట్ల హోం ఐసొలేష న్ కిట్లు పంపిణీ చేశారని, 2 కోట్ల కరోనా కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే మం దులు వాడాలన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యారోగ్య సిబ్బంది సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్ర జలు కోరితే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తామన్నారు. అనంతరం అప్రోచ్రోడ్డు పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. జిల్లా దవాఖానను సందర్శించి సౌకర్యాలు, కలెక్టరేట్ పనులను పరిశీలించారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, అలాగే రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించారు. కళాశాలల నిర్మాణ ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు ఏర్పాటుపై మంత్రి హరీశ్రావుకు మంత్రి నిరంజన్రెడ్డి వివరించా రు. మార్చి వరకు పనులు పూర్తి చేసేలా కృషి చేయాల ని కలెక్టర్ షేక్యాస్మిన్ బాషాకు చెప్పారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద డప్పు మేళాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, వైద్యారోగ్య మౌలిక సదుపాయల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ వాకాటి కరుణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీఎంహెచ్వో చందూనాయక్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య తదితరులున్నారు.
.