సమైక్యాంధ్ర అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే..
ప్రోత్సాహక ధరకు సంబంధించిన బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తాం
టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ లోకా భూమారెడ్డి
కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
కడ్తాల్, జనవరి 23 : పాడి పరిశ్రమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో విజయ డెయిరీ బలోపేతమవుతున్నదని టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ లోకా భూమారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో టీఎస్డీడీసీఎఫ్ నిధులు రూ.46 లక్షలతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి చైర్మన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లోకా భూమారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని తెలిపారు. సమైక్య పాలనలో విజయ డెయిరీ నిర్వీర్యమై పోయిందని, పాలకులు విజయ డెయిరీని పట్టించుకోకపోవడంతో తెలంగాణలో రోజుకు కేవలం లక్షన్నర లీటర్ల పాలు మాత్రమే సేకరణ జరిగేదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి పరిశ్రమకు అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధిపరిచారని, రోజుకు లక్షన్నర లీటర్లు ఉన్న పాల సేకరణ ఐదు లక్షల లీటర్లకు చేరుకుందన్నారు. సమైక్య రాష్ట్రంలో విజయ డెయిరీ రూ.30కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో నష్టాన్ని పూడ్చుకొని ప్రస్తుతం విజయ డెయిరీకి రూ.61 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
గతంలో విజయ డెయిరీ కేవలం 14 రకాల ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసేదని, ప్రస్తుతం డెయిరీ 28 రకాల ఆహార ఉత్పత్తి చేస్తున్నదని పేర్కొన్నారు. గతంలో విజయ డెయిరీలో ఏడాదికి రూ.350 కోట్ల వ్యాపారం జరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం డెయిరీని అభివృద్ధి చేయడంతో రూ.710 కోట్ల వ్యాపారానికి చేరుకుందని చెప్పారు. రోజుకు 8 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా ప్రభుత్వం రావిర్యాల గ్రామంలో రూ.246 కోట్లతో మెగా విజయ డెయిరీ ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. పెండింగ్లో ఉన్న పాల ప్రొత్సాహక ధర బిల్లులను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని లోకా భూమారెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీలు ఆనంద్, అనంతరెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చెన్న కిషన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, యాదయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్లు రామకృష్ణ, జైపాల్రెడ్డి, వినోద్, అనిల్యాదవ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, చందోజీ, జంగారెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, భిక్షపతి, లాయక్అలీ, జహంగీర్అలీ, రాంచంద్రయ్య, కృష్ణ, మోత్యానాయక్, శేఖర్గౌడ్, నరేశ్నాయక్, ప్రేమ్రాజ్, నర్సింహ, మహేశ్, వెంకటేశ్, నరేశ్, ఇర్షాద్, పాలశీతలీకరణ కేంద్రం డీడీ శివాల్కర్, మేనేజర్ రాధిక, షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్, సీఐ ఉపేందర్, ఎస్ఐలు హరిశంకర్గౌడ్, వరప్రసాద్, ధర్మేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు వ్యవసాయమంటే చాలా ఇష్టం..
ఎంపీ రాములు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయమంటే చాలా ఇష్టమని, వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రొత్సాహక ధరను అందజేస్తున్నదని, త్వరలో పెండింగ్లో ఉన్న బిల్లులతోపాటు సబ్సిడీ ఆవులను అందజేస్తుందన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుతో గ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుతో కడ్తాల్ మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. కడ్తాల్ పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లులను అందజేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాడి రైతులు విజయ డెయిరీలో నాణ్యమైన పాలను పోసి, అధిక ధరలను పొందాలని కోరారు.