జయంతి సభల్లో ప్రజాప్రతినిధులు
పార్టీలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో చంద్రబోస్ చిత్రపటాలకు నివాళ్లు
షాద్నగర్టౌన్, జనవరి 23 : నేటితరం యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అని మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాశ్గౌడ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని నేతాజీ విగ్రహానికి ఆదివారం కౌన్సిలర్లు జీ.టీ శ్రీనివాస్, సర్వర్పాషా, యువజన సంఘం అధ్యక్షుడు వన్నాడ వెంకటేశ్గౌడ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నందు, వెంకటరామారావు, శంకర్, మల్లేశ్, లక్ష్మణ్, ప్రదీప్, నర్సింగ్రాథోడ్ పాల్గొన్నారు.
హయత్నగర్ రూరల్ : స్వాతంత్య్ర సమరయోధుడు సుభాశ్ చంద్రబోస్ అందరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో గౌరెల్లి సర్పంచ్ తుడుము మల్లేశ్, మర్రిపల్లిలో కౌన్సిలర్ పాశం అర్చన, టీఆర్ఎస్ నాయకులు ముద్దం వీరస్వామియాదవ్, పాశం దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ త్యాగం మరువలేనిది
చేవెళ్లటౌన్ : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ త్యాగాలు మరువలేనివని బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నేతాజి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, శర్వలింగం, చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
షాబాద్, : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎబీవీపీ నగర కార్యదర్శి బార్ల శ్రీకాంత్ అన్నారు. సుభాశ్చంద్రబోస్ జయంతి సందర్శంగా షాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చూపిన బాటలో నడువాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభావ్ చంద్రబోస్ జయంతిని మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో నరేశ్,హరి, నితిన్, మహ్మద్ పాల్గొన్నారు.