మొదటగా నియోజకవర్గానికి వంద మంది ఎంపిక
వారంలోగా లబ్ధిదారుల జాబితాను తయారు చేయండి
అధికారులతో కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే..
దళితులు ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం
రూ. 1200 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రంగారెడ్డిజిల్లాలో లక్షా 18వేల 514 దళిత కుటుంబాలు
వికారాబాద్ జిల్లాలో 54,358 కుటుంబాలు
ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
పరిగి, జనవరి 22: ‘దళితుల జీవితాల్లో వెలుగులు నిండేలా దళితబంధు అమలుకు ముందడుగు పడింది.. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లను విడుదల చేసింది… అధికారులతో కలిసి వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మంత్రి నివాసం నుంచి ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. దళితబంధుకు సంబంధించి మొదటగా ఒక్కో నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. లబ్ధిదారుల జాబితాతో పాటు ఫిబ్రవరి నెలాఖరు లోపు లబ్ధిదారుల ఖాతా నంబర్లు, ఇతరత్రా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి, మార్చి మొదటి వారం కల్లా గ్రౌండింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా రంగారెడ్డిజిల్లాలో లక్షా 18వేల 514 దళిత కుటుంబాలు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
వారం రోజుల్లో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. లబ్ధ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆమె స్పష్టం చేశారు. దళితబంధు పథకంపై వికారాబాద్ జిల్లాకు చెం దిన ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులతో శనివా రం ఆమె వర్చువల్ మీట్లో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడుతగా 100 మం దికి దళితబంధు అందించడం జరుగుతుందని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుందని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొదటి విడుతలో 100 మందికి చొప్పున 400 మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేసి, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు వారి వారి నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోపు జాబితాను సిద్ధం చేసి అందించాలన్నా రు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మం జూరు ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూ చించారు. దళిత రక్షణనిధికి ప్రభుత్వం రూ 10 వేలు, లబ్ధ్దిదారుడి ఖాతా నుంచి రూ.10వేలను కలిపి ఏర్పాటు చేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు చెబుతున్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 39,749 కుటుంబాలను గుర్తించారని, కుటుంబ సమగ్ర సర్వేను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సబితారెడ్డి తెలిపారు.
ఈ వర్చువల్ మీట్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రోహిత్రెడ్డి, కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు తదితరులు పాల్గొన్నారు.
మార్చి మొదటి వారం వరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలి
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం దళితుల బంధువుగా ముం దుకు వెళ్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. దళితబంధు పథకం పై శనివారం సాయంత్రం ఆమె తన అధికారిక నివాసం నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన ప్రతి కు టుంబానికి రూ.10లక్షలను బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. తిరిగి ఎలాంటి వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే రూ.10 లక్షల్లో రూ.10వేలు లబ్ధిదారుడి వాటా కింద జమ చేసుకుని, దానికి మరో రూ.10వేలను కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జి ల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దళితబంధు సమితులను ఏర్పాటు చేస్తుందన్నారు. రంగారె డ్డి జిల్లాలో 1,18,514 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం రూ. 1,200 కోట్లను ప్రభుత్వం నేడు విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్యేలు వారం రోజుల్లో లబ్ధిదారుల జాబితాను అధికారులతో కలిసి సిద్ధం చేయాలని, ఫిబ్రవరి నెలాఖరులోపు లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నం బర్లు, ఇతరత్రా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మార్చి మొదటి వారం వరకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. దళితులు సమాజం లో ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించాలన్నది సీఎం కేసీఆర్ అభిమతమని, ఆ దిశగా దళితబంధుతో అడుగులు వేస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలో నియమితులైన అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, మూసీనది రివల్ ఫ్రంట్ బోర్డు చైర్మన్ సుధీర్రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, అధికారులు పాల్గొన్నారు.