పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం రైతు వ్య తిరేక విధానాలను అవలంబిస్తున్నదని, యాసం గి వడ్లు కొనుగోలు చేయమని చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని, ఇతర రాష్ర్టాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ ధాన్యాన్నే పండిస్తారని, వాటిని కొనాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, పంటలకు పెట్టుబడి సాయా న్ని అందిస్తూ, 24 గంటలు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నారని కొనియాడారు. రైతులు చెరువుల కింద, చౌడు పొలాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వరి వేయాల్సి వస్తే సన్నరకం వేయాలని, వాటికి మంచి డిమాండ్ ఉందన్నా రు. వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన ట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, పరిగి, కులకచర్ల రైతుబంధు సమితి మండలాల అధ్యక్షులు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్వర్ధ్దన్రెడ్డి, సర్పంచ్లు వెంకటయ్య, నల్క జగన్, శ్రీనివాస్, గణేశ్, కౌన్సిలర్లు కృష్ణ, రవీంద్ర, మునీర్, వెంకటేశ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.