క్రీడలకు సర్కారు ప్రాధాన్యం
క్రీడలు, పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మినీ స్టేడియం మంజూరుకు హామీ
ఉత్తనూరులో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
పాల్గొన్న 20జట్ల క్రీడాకారులు
వర్షం కారణంగా సెమీ ఫైనల్స్ నేటికి వాయిదా
అయిజ/అయిజ రూరల్, నవంబర్ 19: బాస్కెట్ బాల్ క్రీడాకారులు పోటీల్లో రాణించి దేశానికి, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థా యి 5వ అంతర్ జిల్లాల అండర్-19 బాస్కెట్ బాల్ టోర్నీని ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నా రు. క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల కల్పనలో 2శాతం రిజ్వేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మారుమూల గ్రామం ఉత్తనూర్లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని 10ఉమ్మడి జిల్లాల నుంచి 20జ ట్ల క్రీడాకారులు టోర్నీకి తరలివచ్చారన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని సెమీ ఫైనల్ పోటీలను మంత్రి ప్రా రంభించారు. అంతకుముందు అయిజ పట్టణానికి సమీపంలోని కట్టకింద తిమ్మప్పస్వామి, ఉత్తనూర్లోని ధ న్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రభు త్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత తిరుమల్రెడ్డి కృషి వల్లే ఉత్తనూర్లో ఏ కార్యక్రమం జరిగినా విజయవంతం అవుతుందన్నా రు. సీఎం కేసీఆర్ కృషితో దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చే స్తున్నట్లు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు బాస్కెట్ బాల్ క్రీడలపై అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకే రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహిస్తున్నట్లు మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ సుదర్శనమ్మ, తెలంగాణ బాస్కెట్ బాల్ అ సోసియేషన్ ప్రధానకార్యదర్శి నార్మన్ ఐజాక్, కార్యదర్శి నీలిమ, టీఆర్ఎస్ యువనేత అజయ్, మాజీ ఎంపీపీ సుందర్రాజు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రాము డు, పులకుర్తి శ్రీనాథ్రెడ్డి, పులకుర్తి మనీశ్రెడ్డి, జూపల్లి భాస్కర్రావు, రామిరెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు, బాస్కె ట్ బాల్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
హోరాహోరీగా బాస్కెట్బాల్ టోర్నీ
బాస్కెట్బాల్ టోర్నీ హోరాహోరీగా కొనసాగింది. క్వార్టర్ ఫైనల్లో బాలికల విభాగం నల్గొండ – మహబూబ్నగర్ జట్లు తలపడగా, మహబూబ్నగర్ జట్టు 41 స్కోర్తో సాధించగా, నల్గొండ జట్టు 45 స్కోర్తో విజయకేతనం ఎగురవేసింది. నల్గొండ జట్టులో శృతి 15, అన్షుత 11 స్కోర్ సాధించారు. మహబూబ్నగర్ జట్టులో భువనేశ్వరి 20, శ్రీవల్లిక 06 స్కోర్ సాధించారు. ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మెదక్ జట్టు 21 స్కోర్, ఆదిలాబాద్ జట్టు 44 స్కోర్ సాధించి గెలుపొందింది. ఆదిలాబాద్ జట్టులో యశశ్విని 24, హిత 6 స్కోర్ సాధించగా, మెదక్ జట్టులో జాహ్నవి 8, షర్ష 4 స్కోర్ సాధించారు. బాలుర విభాగంలో వరంగల్-మహబూబ్నగర్ జట్లు తలపడగా, వరంగల్ జట్టు 47 స్కోర్, మహబూబ్నగర్ జట్టు 58 స్కోర్ సాధించి వియకేతనం ఎగుర వేసింది. చివరగా ఖమ్మం- కరీంనగర్ జట్లు కోర్టులోకి వచ్చి ఆట ప్రారంభించగా, వర్షం అడ్డంకిగా మారడంతో వాయిదా వేసినట్లు కార్యదర్శి నీలిమ, స్కోర్ మేనేజర్ ఫీటర్ తెలిపారు.