జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య
కొత్త సాగుచట్టాల రద్దు నిర్ణయంతో సంబురాలు
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
జడ్చర్లటౌన్, నవంబర్ 19: దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న దీక్షతోపాటు టీఆర్ఎస్ నాయకులు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దుకు నిర్ణయం తీసుకున్నదని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం జడ్చర్లలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ కూడలిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఏడాదికాలంగా రైతులు చేపడుతున్న ఆందోళనను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దిగొచ్చిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులందరికీ లాభం చేకూరిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాపతి అని చెప్పారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొంగలి జంగయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, కౌన్సిలర్లు లత, చైతన్యచౌహాన్, ప్రశాంత్రెడ్డి, రమేశ్, శశికిరణ్, బుక్కామహేశ్, నాయకులు ఇఫ్తేకారోద్దీన్, వెంకటేశ్, రామ్మోహన్, పరమటయ్య, నాగిరెడ్డి, కాలేబ్, రామకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, సుధాకర్రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.