ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల,నవంబర్19: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రైతుల చేపట్టిన పోరాటం ఫలించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రధానమంత్రి మోడీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకర విషయని ఎమ్మెల్యే చెప్పారు. నల్లా చట్టాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతన్నలు, భారతీయకిసాన్ యూనియన్నేత రాకేష్టికాయత్కు ఎమ్మెల్యే ఉద్యమాభి వందనాలు తెలియజేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అందోళన చేయడంతో కేంద్రం దిగి రాక తప్పలేదన్నారు. భవిష్యత్లో రైతుల చేసే పోరాటాలకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులను కార్లతో తొక్కించి వారి మరణాలకు కారకులైన మంత్రి కుమారిడితో పాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని అన్ని మండలకేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే బండ్ల భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించలేదని వారు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వస్తుందని ముందే గ్రహించి ఎమ్మెల్యే ఈ వినూత్న కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారన్నారు. నాడు రైతుల కోసం ఎమ్మెల్యే చేసిన కృషి నేడు ఫలించిందన్నారు.
ఇది రైతుల విజయం
గద్వాల,నవంబర్19: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా రైతులు విరోచిత పోరాట ఫలితంగా కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయక తప్పడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి , సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు చెప్పారు. శుక్రవారం వారి ,వారి కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కిసాన్మోర్చా నాయకత్వంలో స్ఫూర్తిదాయకమైనా సాహసోపేతమైనా పోరాటం చేసి చారిత్రక విజయం సాధించినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. మొండిగా ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం రైతుల విరోచిత పోరాటానికి దిగిరాక తప్పలేదని చెప్పారు. రైతు చట్టాల రద్దుతోపాటు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటంలో 700మంది చనిపోయిన వారి మరణం పట్ల ప్రధాని పశ్చాతాపం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వీవీ నరసింహ, దేవదాస్, రాజు, మద్దిలేటి నర్మద, సీపీఐ నాయకులు రంగన్న, కృష్ణ, ఆశన్న, సత్యరాజ్, పరమేశ్ ఉన్నారు.
రైతాంగ సమితి హర్షం
గద్వాల రూరల్,నవంబర్19: వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తునట్లు ప్రకటించడంతో తెలంగాణ రైతాంగ సమితి హర్షం వ్యక్తం చేసింది. రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేసి పార్లమెంట్లో అమోదం చేసే వరకు పోరాటం ఆగదని జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి అన్నారు. కార్యక్రమంలో గోపాల్, శంకర్ ప్రభాకర్ పాల్గొన్నారు.