మంత్రి విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించిన వైద్యులు
కృతజ్ఞతలు తెలిపిన అమాత్యుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఇక నుంచి సీటీ స్కానింగ్ పరీక్షలు రూ.2500లకే చేయనున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఐఎంఏ, ఎన్డీఏ వైద్య పరీక్ష రేట్లను హెచ్ఆర్సిటీ లంగ్స్, సిటీ స్కానిం గ్ పరీక్షలను రూ.4500 నుంచి 2500లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్కు చెంది న వైద్యులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్యులు సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొవిడ్ బాధితుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీటీ స్కా నింగ్ రేట్లను తగ్గించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం సూచించిన రేట్ల ప్రకారం ప్రైవేట్ దవాఖానలో ఫీజులు తీసుకోవాలని తెలిపారు. వైద్యం కోసం వచ్చిన వారిని ఫీజుల కోసం ఒత్తిడి తేవద్దని తెలిపారు. రేట్లు తగ్గించిన వైద్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ఐఎంఏ అధ్యక్షుడు రామకృష్ణ, వైద్య బృందం, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులున్నారు.
అటవీ ఉద్యోగులను ఆదుకుంటాం..
కొవిడ్ బారిన పడిన అటవీ ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అటవీ కార్యాలయంలో కొవిడ్తో మృతి చెందిన ఐదుగురు ఉద్యోగులకు నివాళులర్పించారు. మృతి చెందిన వారికి తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అటవీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని సకాలంలో అందించేందుకు కృషిచేస్తామని చెప్పారు. అనంతరం వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్డీపీటీ వినోద్ కుమార్, చైర్మన్ ఈశ్వర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.