ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
తుర్కయాంజాల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
తుర్కయాంజాల్, జనవరి 19 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ అధ్యక్షతన జరిగింది. 138 రకాల వివిధ అభివృద్ధి పనులకు గాను రూ.14.33 కోట్లకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. వివిధ అభివృద్ధి పనులకు పట్ణణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం, మున్సిపల్ సాధారణ నిధులు, హరితహారం తదితర నిధులను కేటాయించారు. వార్డుల పరిధిలో నూతనంగా వెలుస్తున్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కౌన్సిలర్లు సభకు విన్నవించారు. అదేవిధంగా కాలనీల్లో విద్యుత్ దీపాల కొరత లేకుండా చూడాలని కోరారు. కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం చేపట్టాకే సీసీ రోడ్లు వేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని పలువురు కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధుల కేటాయింపులో సమన్యాయం పాటించినప్పుడే వార్డులు అభివృద్ధి సాధిస్తాయన్నారు. పనుల ప్రాధాన్యతను బట్టి పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు రమావత్ కళ్యాణ్, కొశిక ఐలయ్య, కౌన్సిలర్లు కీర్తన, గుండా భాగ్యమ్మ, తాళ్లపల్లి సంగీత, వేముల స్వాతి, జ్యోతి, అనురాధ, మాధవి, అనిత, ధన్రాజ్, బాల్రాజ్, హరిత, రవీందర్రెడ్డి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్య భద్రతకు భరోసా
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి పథకం అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కల్లు విఠల్రెడ్డికి రూ.2.50 లక్షల ఎల్వోసీ, చింతపట్ల గ్రామానికి చెందిన లింగంపల్లి రోహిత్కు రూ.1.50 లక్షల చెక్కును బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శివలీల, డైరెక్టర్ స్వరూప, చైర్మన్ రాజేందర్రెడ్డి, నాయకులు కృష్ణ, యాదయ్య, చంద్రయ్య, మధుకర్ పాల్గొన్నారు.